చంద్రబాబు కుటుంబానికి భద్రత తొలగించిన ఏపీ ప్రభుత్వం

చంద్రబాబు కుటుంబానికి భద్రత తొలగించిన ఏపీ ప్రభుత్వం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించింది. ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేశ్ కు జెడ్ కేటగిరీని తొలగించింది. గతంలో లోకేష్ కి 5+5 భద్రత ఉండేది. కాగా దానికి 2 +2 గన్ మెన్ల కు కుదిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తి సెక్యూరిటిని తొలగించింది. అయితే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో… కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భద్రతను తగ్గించినందుకు టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు… మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎంపీల పార్టీ మార్పు, ప్రజా వేదిక కూల్చివేత తదితర విషయాలపై చంద్రబాబు నేడు స్పందించే అవకాశం ఉంది.