ఆన్ లైన్ లో మోసపోయిన కేజ్రీవాల్ కూతురు

ఆన్ లైన్ లో మోసపోయిన కేజ్రీవాల్ కూతురు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ ఓ ఆన్ లైన్ లావాదేవీల్లో మోసపోయారు. ఓ ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకున్న హర్షితను కేటుగాడు మోసం చేశాడు. మొదట కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత హర్షిత పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంట్ లో ఉన్న రూ. 34 వేలను కొట్టేశాడు. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.