అశ్వత్థామరెడ్డి,రాజిరెడ్డిల ఆరోగ్యం క్షీణించింది

అశ్వత్థామరెడ్డి,రాజిరెడ్డిల ఆరోగ్యం క్షీణించింది

ఇళ్లలో దీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తున్న ఇద్దరు నాయకులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వీరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇద్దరి నాయకుల ఆరోగ్యం క్షీణించిందని… బీపీ,షుగర్ లెవల్స్ పడిపోయయన్నారు. దీక్ష కంటిన్యూ చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందని తెలిపారు.