అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
గౌహతి : దేశంలో ప్రాంతీయ అసమానతలను అంతం చేసేందుకు జోన్కు ఒకటి చొప్పున 5 రాజధానులు కావాలని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతిపాదించారు. ఇతర రాష్ట్రాలను ఎగతాళి చేస్తున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్తో ప్రస్తుతం డైలాగ్ వార్ నడుస్తోందన్నారు. అసమానత అనే వ్యాధిని నయం చేయడానికి మనం అందరం కృషి చేయాలని, పేద రాష్ట్రాలను వెక్కిరించకూడదని చెప్పా రు. దేశంలో 5 రాజధానులను చేయగ లమా? అని ఆయన ట్వీట్ చేశారు.
‘‘ఢిల్లీలాంటి ప్రభుత్వాల మాదిరిగా, ఈశాన్య, తూర్పు రాష్ట్రాల వద్ద పెద్ద మొత్తంలో సంపద లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో విద్య, వైద్యరంగాల్లో ఇప్పుడిప్పుడే గొప్పగా పనిచేస్తున్నాం” అని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.