తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు కేసీఆర్ దావత్

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలకు కేసీఆర్ దావత్

ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.317 జీవోకు వ్యతిరేకంగా వరంగల్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన హిమంత బిశ్వశర్మ.. మోడీ దేశానికి దారి చూపాడన్నారు. ప్రజాబలం ముందు ధన బలం పనిచేయదన్నారు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. ఈటల గెలుపుతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదన్నారు. కేసీఆర్ ను చూసి ఏదైనా నేర్చుకుందామని.. వచ్చా కానీ నేర్చుకోవడనాకి ఇక్కడ ఏం లేదన్నారు.  యువకులు, ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని..పోలీసులు మాత్రమే సపోర్ట్ గా ఉన్నారన్నారు. 317 జీవో ఎమోషన్ అర్థం అయ్యిందన్నారు.   కొడుకు ను సీఎం చేయడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారన్నారు. దేశం మారిందని. కేసీఆర్ నాటకాలు సాగవన్నారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమన్నారు. 

అస్సాంలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోచి పెడుతున్నారన్నారు. కేసీఆర్ అరాచకాలు పెరిగాయన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఐ, సీపీఎంలకు కేసీఆర్ దావత్ ఇచ్చారన్నారు. తెలంగాణ ఆదాయం 9లక్షల కోట్లు, అస్సాం ఆదాయం 3లక్షల కోట్లు అని అన్నారు. పోలీసుల సపోర్ట్ తో కేసీఆర్ ఎన్ని రోజులు పాలిస్తారని ప్రశ్నించారు.