డాక్టర్ల నిర్లక్ష్యం..గర్బిణీ మృతి

డాక్టర్ల నిర్లక్ష్యం..గర్బిణీ మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. డాక్టర్ నిర్లక్ష్యం తో మూడు నెలల గర్బిణీ మృతి చెందింది. తీవ్ర మైన రక్తస్రావం కావడంతో స్థానిక సాయి రామ్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే  డాక్టర్ల నిర్లక్ష్యం తో మూడు నెలల నందిని చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చినా పట్టించుకోలేదని.. ట్రీట్మెంట్ చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు.

డాక్టర్లు, సిబ్బంది తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. తన  భార్య మృతికి కారణం అయిన డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందిని భర్త డిమాండ్ చేశారు. నందిని మృతితో  తల్లికి దూరమైన చిన్నారులు  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.