
మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. వినాయక్ నగర్ కాలనీలో మద్యం మత్తులో కొందరు యువకులు ఒక యువకుడిపై గ్యాస్ పైపులతో దాడి చేశారు. ఈ ఘటనలో కళ్యాణ్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 2 లో ఓ ప్రైవేట్ హాస్టల్ లో నాలుగు నెలల క్రితం నివాసం ఉన్న కళ్యాణ్ అనే యువకుడు హాస్టల్ ఫీజు కట్టలేక హాస్టల్ వదిలి వెళ్ళిపోయాడు. ఆగస్టు 29 రాత్రి 27 వేల చెల్లించాల్సింది ఉండగా 17వేలు చెల్లిద్దామని హాస్టల్ కు వచ్చాడు. అయితే హాస్టల్ నిర్వాహకులు ఆ డబ్బులు తీసుకోకపోవడంతో వెనక్కి వెళ్లాడు. కొందరు గుర్తు తెలియని యువకులు పిడిగుద్దులు గుద్ది.. గ్యాస్ పైపులతో కొట్టారు. దీంతో తీవ్రగాయాలైన కళ్యాణ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదంగా ఉండడంతో 108 సిబ్బందితో ప్రాథమికంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో యువకుడి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు..