కారేపల్లి, వెలుగు: కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ఇప్పించలేదని జడ్పీటీసీపై ఓ కార్యకర్త పెట్రోల్పోశాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ అతిరామ్ టీఆర్ఎస్ కార్యకర్త. సొసైటీ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. జడ్పీటీసీ జగన్ తన గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో టికెట్ఇప్పించమని పలుసార్లు కోరాడు. దీనికి జగన్ఒప్పుకోలేదు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పార్టీ టికెట్ ఇప్పించడం కుదరదని తేల్చి చెప్పాడు.
మనస్తాపానికి గురైన అతిరామ్ శుక్రవారం ఓ పెండ్లికి హాజరైన జడ్పీటీసీపై క్యాన్లో తీసుకువెళ్లిన పెట్రోల్ పోశాడు. గమనించిన మిగతా నాయకులు అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. జడ్పీటీసీ ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.