శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత

శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత

సినిమా ప్రియులకు బిగ్ బ్రేకింగ్.. ఎల్లుండి నుంచి అంటే శుక్రవారం నుంచి సిటీ మినహా మిగతా చోట్ల ధియేటర్లు బంద్ చేయనున్నట్టు ఎగ్జిబిటర్ కౌన్సిల్ ప్రకటించింది. కొత్త సినిమాలు లేక ధియేటర్లు నడపడం చాలా కష్టంగా ఉందని ధియేటర్ల యజమానులు తెలిపారు. మే 17 నుంచి రాష్ట్రంలోని ద్వితియ శ్రేణి నగరాల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసి వేస్తున్నట్తు వెల్లడించారు.

దాదాపు 10 రోజులు పాటు ధియేటర్లను బంద్ చేయనున్నట్టు తెలిపారు ఎగ్జిబిటర్లు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు యథాతథంగా నడుస్తాయని వెల్లడించారు. నిర్వహణ భారం ఎక్కువ కావడంతోనే సింగల్ స్క్రీన్ ధియేటర్లను బంద్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.   ధియేటర్ అన్నాక.. ఒకసారి హాల్ మొత్తం నిండి హౌజ్ ఫుల్ బోర్డు ఉంటుంది.. మరోసారి ఒకే ఒక్క టికెట్ తెగి హాల్ మొత్తాన్ని నడపాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే మెంటెన్స్  ఎక్కవ అవుతుండటం కరెంటు, గేట్ మ్యాన్ల జీతాలు కూడా ఎల్లని ఎన్నో సందర్భాలు ఉన్నాయని ఎగ్జిబిటర్లు తెలిపారు.   ప్రతి ఏడాది వేసవిలో చిన్నా,  పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయాని ఈ ఏడాది కూడా విడుదల అవుతాయని అనుకున్న క్రమంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీలో 12‌ వందల సింగిల్ స్ర్కీన్ ధియేటర్లు  ఉన్నాయి. మరి అక్కడ మూసేస్తారా లేదా అనేది ఎగ్జిబిటర్లు చర్చించనున్నట్టు తెలుస్తుంది.   

 తెలంగాణలో ధియేటర్లు  మూతపడే పట్టణాలు ఇవే..

నల్లగొండ, అదిలాబాద్, భువనగిరి, సూర్యాపేట, మిర్యాలగూడ, జనగామ, సిద్ధిపేట, మంచిర్యాల, కామారెడ్డి, కోదాడ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, మెదక్, ములుగు, వికారాబాద్, మహబూబబాద్, సిరిసిల్ల, ఆసీఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, చౌటుప్పల్, తాండూర్, భద్రాచలం ఇంకా మిగిలిన పట్టణాల్లో ధియేటర్లు  మూతపడనున్నట్టు తెలుస్తుంది.