ప్రఖ్యాత రెజ్లర్ బబితా ఫోగాట్, ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు సమక్షంలో వారు బీజేపీలో చేరారు. మంత్రి కిరెన్ రిజిజు వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మహావీర్ సింగ్ ఫోగాట్ హర్యానా కు చెందిన ఫేమస్ రెజ్లర్. ఆయన కుమార్తెలు బబిత కుమారి, గీతాఫోగట్ లను కూడా రెజ్లర్లుగా తీర్చిదిద్దిన మహావీర్ వారిని ఒలింపిక్స్ స్థాయిలో రాణించేలా కృషి చేశారు. ఆయన జీవిత కథ బాలీవుడ్ లో “దంగల్’ సినిమాగా రూపొంది.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకొంది.