ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM

ప్రచారానికి ముందు.. పుణ్యస్నానం ఆచరించిన CM

లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఆయా రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకర్గాల్లో దశల వారీగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి గురువారం ఉజ్జయినిలోని శిప్రా నదిలో పుణ్యస్నానాలు చేశారు. శిప్రా నదికి పూజా కార్యక్రమాలు చేశారు. ఆయన శిప్రా నది పవిత్రత గురించి మీడియాకు తెలిపారు. నదుల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

 సీఎం స్వస్థలం ఇక్కడే కావడంతో తరచూ ఆయన ఇక్కడికి వస్తుంటారు. ఇండోర్-మాల్వాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఎంపీ సీఎం మోహన్ యాదవ్ ఉజ్జయినిలోని శిప్రా నదిలో పవిత్ర స్నానం చేశారు. నదీలో కాసేపు అలా ఈత కొట్టారు. అనంతరం ఇండోర్,-మాల్వాలో పార్లమెంట్ ఎలక్షన్ క్యాపెయినింగ్ ప్రారంభించారు.