కోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు

కోవీషీల్డ్ ఎఫెక్ట్ : కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో తొలగింపు

కరోనా నుంచి దేశాన్ని రక్షించిన ప్రధాని మోదీ.. మోదీ చొరవ వల్లే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటూ నిన్నా మొన్నటి వరకు చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లలో.. ప్రధాని మోదీ ఫొటో ఉంటుంది.. ఇక నుంచి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ప్రధాని మోదీ ఫొటో తొలగించటం జరిగిందని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇంత సడెన్ గా.. ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ల కోసం CoWIN సర్టిఫికేట్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తీసేసింది. ఇంతకుముందు, ఈ సర్టిఫికెట్లపై కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడానికి భారతదేశం ఐక్య సంకల్పాన్ని చెప్పే కోట్‌తో పాటు మోదీ ఫోటోను ప్రముఖంగా ప్రదర్శించాయి.  

ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి యూకే కోర్టులో పిటిషన్ దాఖలు కావడం. దీనిపై సంస్థ స్పందిస్తూ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరగుతున్నాయని తెలుపడంతో చర్చనీయాంశం అయ్యింది. 

ఇప్పుడు వ్యాక్సిన్ పై మోదీ ఫోటో తీసేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిపికెట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మోదీ ఫోటోను తొలగించారు ఇప్పుడే సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసి చూశాను అని కామెంట్ చేశారు. 

దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ  ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కారణంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ నుండి చిత్రాన్ని తొలగించడం జరిగిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.