విద్యుత్ అధికారులపై టీఆర్ఎస్ కౌన్సిలర్ల దాడి

విద్యుత్ అధికారులపై టీఆర్ఎస్ కౌన్సిలర్ల దాడి

మంచిర్యాల: విద్యుత్ శాఖ అధికారులపై బాల్క సుమన్ అనుచరులు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చెన్నూరు పట్టణంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లో  షాపింగ్ కాంప్లెక్స్ కోసం మున్సిపల్ అధికారులు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. విద్యుత్ శాఖ అనుమతి లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని మున్సిపల్ అధికారులను విద్యుత్ అధికారులు ప్రశ్నించారు. దాంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు విద్యుత్ అధికారులపై విచక్షణారహితంగా దాడిచేశారు.

కాగా..  తమపై దాడిచేసిన బాల్క సుమన్ అనుచరులు, మున్సిపల్ కౌన్సిలర్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు.. పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపేసి సబ్ స్టేషన్ ఆవరణలో నిరసనకు దిగారు.