కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదిలిపెట్టం

కేసీఆర్  సొరంగంలో దాక్కున్నా వదిలిపెట్టం

బీజేపీకి భయపడే కేసీఆర్ కమ్యూనిస్టులను పిలిచి దావత్ ఇచ్చాడన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందని..ఎవరూ భయపడొద్దన్నారు. సీఎం కేసీఆర్ ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తామన్నారు. కేసీఆర్ సొరంగంలో దాక్కున్నా వదలబోమని.. జేసీబీలు పెట్టి చీల్చీ జైలుకు పంపుతామన్నారు.కేసీఆర్ ను ,కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.  2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. 317 జీవో రద్దు చేయాలంటూ వరంగల్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే 317జీవోను చెత్తబుట్టలో వేస్తామన్నారు. బీజేపీ పోరాటానికి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్ కు రాష్ట్రంలో ఎవరూ మద్దతివ్వడం లేదన్నారు. అందుకే మొన్నటి వరకు వామపక్షాలను తిట్టిన కేసీఆర్ వారిని పిలిచి ప్రగతి భవన్లో దావత్ ఇచ్చాడన్నారు. కేసీఆర్ చైనాకు సపోర్ట్ చేస్తున్నాడని..అందుకే కమ్యూనిస్టులతో మ్మక్కయ్యాడన్నారు.రాష్ట్రంలో ఇప్పటికీ 13 జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు రాలేదన్నారు. ప్రధాని మోడీ ఫోన్ చేసి బీజేపీ పోరాటాన్ని మెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ మెడలు వంచుతామని.. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ ను బద్దలు కొడతామన్నారు. గూగుల్ లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరే వస్తోందన్నారు సంజయ్.