- విండీస్టూర్కు జట్టు ఎంపిక వాయిదా
- శని, ఆది వారాల్లో జరిగే చాన్స్
- ఇండియాకు వచ్చిన విరాట్
కరీబియన్ టూర్కు జట్టులో ఎవరెవరు ఉంటారు? టీమ్ఎంపిక తర్వాత ధోనీ రిటైర్మెంట్పై సెలెక్టర్లు ఏమైనా క్లారిటీ ఇస్తారా? కెప్టెన్, వైస్కెప్టెన్మధ్య విభేదాలు ఉన్నాయని వార్తల నేపథ్యంలో లిమిటెడ్ ఓవర్స్ సారథ్యం రోహిత్కు అప్పగించే సాహసం చేస్తారా? టీ20 వరల్డ్కప్ దృష్ట్యా కుర్రాళ్లకు అవకాశం కల్పిస్తారా? ప్రస్తుతం టీమిండియా సగటు అభిమానిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు శుక్రవారం సమాధానం లభిస్తుందని ఆశించినా.. సెలెక్షన్ కమిటీ సమావేశం వాయిదా పడటంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది..! ఏదేమైనా ధోనీ ఫ్యూచర్ను లక్ష్యంగా చేసుకుని సింగిల్పాయింట్అజెండాగా జరిగే సెలెక్టర్ల సమావేశం ఈ అంశానికి ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి..!
ముంబై: వరల్డ్కప్ నిష్క్రమణ తర్వాత.. అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం ధోనీ రిటైర్మెంట్. అతన్ని కొనసాగిస్తారా ? లేక పక్కనబెడతారా? ఒకవేళ తీసుకుంటే టీమ్లో మహీ పాత్ర ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో ముడిపడి ఉన్న కరీబియన్ టూర్కు జట్టు ఎంపిక సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. వాస్తవానికి శుక్రవారమే టీమ్ను ప్రకటించాల్సి ఉన్నా సీఓఏ ఇచ్చిన కొత్త ఆదేశాల వల్ల దీనిని వాయిదా వేశారు. ఈ కొత్త రూల్కు సంబంధించిన లీగల్ పేపర్వర్క్జరగాల్సి ఉండటంతో టీమ్ఎంపిక శని లేదా ఆదివారాల్లో జరిగే అవకాశముంది. కెప్టెన్ విరాట్గురువారం సాయంత్రం భార్య అనుష్కతో కలిసి ఇండియాకు చేరుకున్నాడు. కాబట్టి సమావేశానికి అతను ప్రత్యక్షంగా హాజరుకానున్నాడు. దీంతో అందరితో సుదీర్ఘంగా చర్చించి టీమిండియాను ఎంపిక చేయాలని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ధోనీ కెరీర్కు సంబంధించి కూడా ఓ స్పష్టత ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఓవైపు మాజీలు కూడా వీడ్కోలు విషయంపై మహీతో మాట్లాడాలని డిమాండ్చేస్తున్న నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. ధోనీని ఎంపిక చేసినా.. ఉద్వాసన పలికినా.. టీమిండియా ఫ్యూచర్కోసం తీసుకోబోయే కఠిన నిర్ణయాలు ఇక్కడి నుంచే మొదలుకానున్నాయి. టీ20 వరల్డ్కప్దృష్ట్యా వికెట్కీపర్గా రిషబ్ పంత్కే ఎక్కువ అవకాశాలున్నాయి. గతేడాది అక్టోబర్లో విండీస్తో జరిగిన టీ20 సిరీస్కు మహీని విశ్రాంతి పేరుతో తప్పించారు. ఇప్పడు కూడా అదే విధంగా జరిగే అవకాశాలున్నాయి. కరీబియన్ టూర్ తర్వాత స్వదేశంలో బిజీ షెడ్యూల్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ధోనీ లేకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నారు.
కోహ్లీ వెళ్తాడా?
విండీస్టూర్కు అందుబాటులో ఉంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించినా.. స్వదేశంలో బిజీ షెడ్యూల్కారణంగా అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక టెస్ట్ చాంపియన్షిప్ కూడా మొదలుకానుండటంతో.. విండీస్తో లిమిటెడ్ఓవర్ల సిరీస్కు రోహిత్ను కెప్టెన్గా ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాపై కూడా కసరత్తులు చేస్తుండటం కూడా ఇది ఓ కారణం కావొచ్చు. టెస్ట్ల వరకు విరాట్ జట్టుతో చేరొచ్చు. బుమ్రాకు కూడా ఇదే వర్తించనుంది.
బలమైన ‘మిడిల్’ కోసం
ఈ సమావేశంలో మరింత ఎక్కువ చర్చ మిడిలార్డర్పై జరుగనుంది. ఇప్పటివరకు మిడిలార్డర్కోసం చాలా మందిని పరీక్షించినా ఒక్కరు కూడా కుదురుకోలేదు. ఇప్పుడు రాయుడు, విజయ్ శంకర్ కూడా లేకపోవడంతో మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, పృథ్వీ షాలాంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇండియా–ఎ తరఫున విండీస్లో గిల్, మనీష్దుమ్మురేపుతున్నారు. వరల్డ్కప్లో విఫలమైన దినేశ్కార్తీక్, కేదార్ జాదవ్కెరీర్కు ముగింపు పడ్డట్లే. ధవన్ గాయం నుంచి కోలుకుంటే తిరిగి జట్టులోకి వస్తాడు. లేదంటే రాహుల్ను కొనసాగించే అవకాశం ఉంది. పాండ్యా, కుల్దీప్, చహల్ అటోమెటిక్గా ఎంపికకానున్నారు. టీనేజ్ లెగ్స్పిన్నర్ రాహుల్చహర్గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. పేస్బౌలింగ్లో షమీ, భువనేశ్వర్తో పాటు కొత్త ముఖాలు నవ్దీప్సైనీ, ఖలీల్ అహ్మద్, దీపక్చహర్, ఆవేశ్ఖాన్ను పరీక్షించొచ్చు. టెస్ట్లకు వచ్చేసరికి ఈ కూర్పు కొద్దిగా మారొచ్చు. టెస్ట్వికెట్కీపర్లుగా పంత్, సాహా మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఓవరాల్గా కొత్త, పాత కలయికతో టీమ్ను ఎంపిక చేసి భవిష్యత్కు భరోసా ఇస్తారా? లేక పాత వాళ్లతోనే మమ అనిపిస్తారా? చూడాలి.