
నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చాలా కాలం కృతయే ఈ భావన నిర్మాణం మొదలవగా.. నిధుల కొరత కారణంగా కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి.
అయితే.. తాజాగా నడిగర్ సంఘం సభ్యులు భావన నిర్మాణ పనులు పూర్తిచేయడానికి సిద్ధమయ్యారు. అందుకోసం నిధులు సేకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందుకోసం తలపతి విజయ్, లోకనాయుడు కమల్ హాసన్, నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కోటి రూపాయలు విరాళంగా అందించారు. అలాగే.. హీరో శివ కార్తికేయన్ కూడా రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
తాజాగా వీరి లిస్టులో చేరాడు తమిళ స్టార్ ధనుష్. ఆయన కూడా నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా కోటి విరాళంగా అందించారు. ప్రస్తుతం అందిన విరాళాలతో భవన నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి ఈ ఏడాది చివరికి ముగించాలని చూస్తున్నారత నడిగర్ సంఘం సభ్యులు.