బెడ్ల ఖాళీ వివరాలను ఆన్ ‌లైన్ ‌లో పెట్టాలి

బెడ్ల ఖాళీ వివరాలను ఆన్ ‌లైన్ ‌లో పెట్టాలి

హైరదాబాద్: ప్రజలంతా భయం గుప్పిట్లో ఉంటే కేసీఆర్ మాత్రం ఫామ్‌ హౌజ్ ‌లో పడుకున్నార‌న్నారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. ‘‘రాష్ట్రంలో పరిస్థితి చూస్తే బాధేస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజు 3480 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. అయినా పాజిటివ్ సంఖ్య ఎక్కువగా వస్తోంది. టెస్టుల సంఖ్య పెంచండి. రాష్ట్రం ఇప్పుడు ప్రమాదంలో పడింది. వనరులన్నింటిని ప్రజల ప్రాణాలు బతికించడానికి వినియోగించండి. ప్రైవేట్ ఆస్పత్రిలో 50 శాతం బెడ్లను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అన్నింటినీ కరోనాకు కేటాయించండి. బెడ్ల ఖాళీ వివరాలను ఆన్ ‌లైన్ ‌లో పెట్టాలి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. హైదరాబాద్‌ లోని హోటల్స్‌ను కూడా స్వాధీనం చేసుకోవాలి.

వాటిని క్వారంటైన్ కోసం ఉపయోగించండి. ప్రజల్లో భరోసా కల్పించండి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళితే కరోనా టెస్టులు చేసే వరకు వైద్యం చేయడం లేదు. రిపోర్ట్‌లు వచ్చే వరకు ఐదారు రోజులు పడుతుంది. ఈలోగా వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయి. సీజనల్ వ్యాధులకు వైద్యం చేసే పరిస్థితి కూడా లేదు. కరోనా పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆధ్వర్యంలో కమిటీలు వేయండి. ఇతర పనుల టెండర్లు ఆపండి. కరోనా మీదే పూర్తిగా దృష్టి పెట్టండి. ప్రైవేట్ విద్య సంస్థల మీద నియంత్రణ పెట్టండి.’’ అని భట్టి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం