పాట్నా: మొదట్లో కరోనా లక్షణాలతో పెషెంట్లు హాస్పిటల్ కు పెద్ద ఎత్తున వచ్చారని, పరిస్థితి భయానకంగా ఉండేదని బీహార్ లోని కొవిడ్ 19 హాస్పిటల్ డాక్టర్లు అన్నారు. బీహార్ ప్రభుత్వం పాట్నాలోని నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (ఎన్ఎంసీహెచ్) లోనే కొవిడ్ 19 పెషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తోంది. ట్రావెల్ హిస్టరీ, కరోనా సింప్టమ్స్ ఉన్న 295 మంది అడ్మిట్ అయ్యారని, వారిలో 25 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని ఎన్ఎంసీహెచ్ సూపరింటెండెంట్ పి.కె.సిన్హా అన్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండటంతో ట్రీట్ మెంట్ తేలికైందని, చాలా మందిని డిశ్చార్జ్ చేశామని, కొందరిని హోం క్వారంటైన్ లో ఉంచినట్లు చెప్పారు. “మొదట్లో కష్టంగా ఉండేది. పెద్ద ఎత్తున పెషెంట్లు హాస్పిటల్ కు వచ్చారు. వేరే ఆప్షన్ లేక అందర్నీ అడ్మిట్ చేసుకున్నాం. పెషెంట్లు వార్డుల్లోని పరిస్థితిపై వీడియోలు తీసి రిలేటివ్స్, ఫ్రెండ్స్ కు పంపారు. తర్వాత కరోనా నుంచి కోలుకునే చాన్స్ ఎక్కువగా ఉందని తేలడంతో ట్రీట్ మెంట్ కు సహకరించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ మేరకు ట్రీట్ మెంట్ అందిస్తున్నాం’ అని డాక్టర్ అజయ్ కుమార్ అన్నారు. మొదట్లో మాస్కులు, రక్షణ పరికరాలు ఏవీ లేవని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోడీతో మాట్లాడిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు చెప్పారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలాంటి సమస్య రాలేదని, తమ వల్ల కరోనా సోకుతుందనే అనుమానంతో పొరుగువాళ్లు, ఇంటి యజమానులు తమను అడ్డుకునేవారని అన్నారు.
మొదట్లో భయానకంగా ఉండేది: బీహార్ డాక్టర్లు
- దేశం
- April 9, 2020
లేటెస్ట్
- దేశంలో మొదటిసారి కులగణన ఎప్పుడంటే?
- వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు