
బెంగళూరు: ఎయిరిండియా విమానంలో ఓ మహిళా డాక్టర్ హల్చల్ చేసింది. తన బ్యాగ్ విషయంపై గొడవ పెట్టుకుని క్యాబిన్ సిబ్బందిని బెదిరించింది.
బెంగళూరులోని యెలహంక ఏరియాలోని శివనహళ్లికి చెందిన ఆయుర్వేద డాక్టర్ వ్యాస్ హిరాల్ మోహన్భాయి(36).. మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు ఎయిరిండియా విమానం ఎక్కింది. తన హ్యాండ్ బ్యాగ్ను ముందు వరుసలోని సీటులో వదిలేసి.. ఆమె మాత్రం 20ఎఫ్ వద్ద కేటాయించిన సీటుకు వెళ్లి కూర్చుంది.
హ్యాండ్ బ్యాగ్ను దగ్గర ఉంచుకోవాలని సూచించిన క్యాబిన్ సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. తన బ్యాగ్ తీస్తే విమానాన్నే కూల్చివేస్తానని వార్నింగ్ ఇచ్చింది. పైలట్ నచ్చజెప్పినా వినకపోవడంతో విమానంలో నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు.