యాదాద్రి పనులపైన సీబీసీఐడీతో విచారణ జరిపించాలి

యాదాద్రి పనులపైన సీబీసీఐడీతో విచారణ జరిపించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట పనులపై సీబీసడీతో విచారణ జరిపించాలన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం ఆయన మండలంలోని చందుపట్లలో పీఏసీఎస్ పెంట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది హైదరాబాద్ లో పడినట్లు వర్షం పడలేదని.. అలా పడి ఉంటే యాదగిరిగుట్ట గుడి కూడా కులి పోయేదన్నారు. రెండు గంటల వర్షానికే క్యూ లైనులు, రోడ్లు, గుడికి ఎదురుగా చెరువు తయారైందన్నారు. ఎనమిది ఏండ్లుగా ఇరవై సార్లు వచ్చిన కేసీఆర్ ఏమి చేశారన్నారు. ఎవరా కాంట్రాక్టర్, సినిమా డైరెక్టర్ కి పని అప్పగించిన కేసీఆర్ యాదగిరిగుట్టను రెండు వేల కోట్ల రూపాయలతో నాశనం చేశాడని చెప్పారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు దాంట్లో దోచుకుంది ఎంత, నాణ్యత మీద కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలన్నారు. ముఖ్యమంత్రికి, విజిలెన్స్ వాళ్లకు లెటర్ రాస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పామ్ హౌస్ లో ఉన్నారని.. వెంటనే వచ్చి యాదాద్రిని పరిశీలించాలన్నారు. ఇఓ గీతారెడ్డి ఇష్టానుసారంగా నామినేషన్ మీద పనులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పరువు తీసిందన్నారు. ఈఓ గీత రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదన్నారు. హరిష్ రావు మంత్రి పదవి కాంగ్రెస్ పుణ్యమన్నారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సోనియాగాంధీ పుణ్యనా తెలంగాణ రాష్ట్ర వచ్చిందని.. ఆమె స్థానంలో ఎవరు ఉన్న తెలంగాణ రాదని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి హక్కు ఉందన్నారు.