బిహార్లో మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ బిహార్లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్కు సంబంధించిన షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 23, నవంబర్ 3, 7న మూడు విడతలుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి ఫేజ్లో 71 సీట్లకు, రెండో విడతలో 94 సీట్లకు, చివరిదైన మూడో ఫేజ్లో 78 స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన గైడ్లైన్స్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు గణాంకాల పరంగా అతి పెద్దవని సునీల్ అరోరా చెప్పారు.