డూప్లికేట్ కీలతో చోరీలు
రూ. 2 లక్షల విలువైన 5 బైకులు సీజ్
జల్సాలకు అలవాటు పడి బైకుల చోరీలకు పాల్పడుతున్న బావ బామ్మర్ధులను జవహర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జవహర్ నగర్ పోలీస్స్టేషన్లో ఏసీపీ శివకుమార్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట్ జిల్లా, కోహెడ మండలం, మైసంపల్లి గ్రామానికి చెందిన తాండూరి శంకర్ (27), దులం హరిశ్ అలియాస్ హరి (23) బావ బామ్మర్ధులు.
కొంత కాలంగా జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్, విఠల్ రావు నగర్కు వచ్చి వీరిద్దరూ పేయింటింగ్ వర్క్ చేస్తుండేవారు. మూడు నెలలుగా డూప్లికేట్ కీ లతో బైకుల చోరీలు చేయడం మొదలు పెట్టారు. అంబేద్కర్ నగర్లోని దారా వైన్స్ వద్ద తన బైక్ చోరీ అయ్యిందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్స్ వద్ద ఉన్న సీసీ పుటేజ్ను పరిశీలించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రోటీన్గా వెహికిల్ చెకింగ్ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. జవహర నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్, ప్రగతి నగర్, దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్లలో 4 బైకులు, సిద్దిపేట్లో ఒక బైకును చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల వద్దనుండి రూ.2 లక్షల విలువచేసే 5 బైకులను సీజ్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీపి శివకుమార్ తెలిపారు. సమావేశంలో జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతి రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ సబ్ఇన్స్పెక్టర్ సైదులు, క్రైం టీం మెంబర్స్ పాల్గొన్నారు.