హిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

హిందుత్వాన్ని ప్రభుత్వం పరిరక్షింస్తుందా లేదా చెప్పండి:  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ప్రభుత్వం స్పందించకుంటే కేంద్రం కఠినంగా వ్యవహరించేలా చేస్తాం

పార్టీ తరపున ఓ కమిటీ వేస్తాం: సోము వీర్రాజు

విశాఖపట్టణం: రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హిందుత్వ ఆలయాలు పై దాడులు జరుగుతున్నాయి… అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే రాష్ట్ర ప్రజలు ఆవేదనకు లోనయ్యారు… అసలు రాష్ర్టంలో హిందుత్వాన్ని పరిరక్షిస్తారా లేదా.. ప్రభుత్వం తేల్చి చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. బిట్ర గుంట, పిఠాపురం లో కూడా అంతర్వేది తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి.. అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందో అర్థం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలు పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి.. లేని పక్షంలో కేంద్రం కఠినంగా వ్యవరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా.. హిందుత్వాన్ని పరిరక్షింస్తుందా లేదా తేల్చి చెప్పాలి… రాష్టంలో దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలు పై బీజేపీ పార్టీ తరపున  ఒక కమిటీ వేస్తామన్నారు. అంత్యర్వేది ఘటన పై టిడిపి మాట్లాడే హక్కు లేదు.. గోదావరి, కృష్ణ, పుష్కరాల సమయంలో ఎన్నో దేవాలయాలను టిడిపి ప్రభుత్వం కూల్చి వేసిందని ఆయన విమర్శించారు. టిడిపి, వైసిపి పార్టీలు మతతత్వ రాజకీయాల పంథాలలో వెళ్తున్నారు… టిడిపి మేనిఫెస్టో లో సైతం క్రైస్తవులకు మేలు చేసే అంశాలు ఇచ్చారు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్చిల నిర్మాణం కోసం నిధులు ఇస్తోందన్నారు. టిడిపి, వైసీపీ, వాళ్లకి సవాల్ చేస్తున్నా.. టిటిడి నిధులతో దేవాలయ నిర్మాణం చేస్తాం అంటున్నారు సరే.. చర్చిలకి వచ్చే ఆదాయంతో  చర్చిల నిర్మాణం చేయగలరా… అసలు చర్చిలు ఆస్తుల పై కమిటీలు వేయగలరా అని ప్రశ్నించారు. టిటిడి బోర్డ్ లో రాజకీయ నాయకులు కాకుండా, స్వామీజీలతో బోర్డ్ ఏర్పాటు చేస్తాం.. 2024 లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రం లో హిందుత్వానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవరించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఆలయాల భూములు అంగుళం కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు: సోము వీర్రాజు

రాష్ట్రంలో దేవాలయాలు భూముల అన్యాక్రాంతం విషయంలో తాము కఠిన వైఖరిని అవలంబిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రభుత్వం జీ ఓ లు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది.. . దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఒక సెంటు దేవాలయం భూమి అన్యాక్రాంతం అయినా బీజేపీ ఒప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. అంతర్విది సంఘటన పై వెంటనే సిటింగ్ న్యాయమూర్తి తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కి లేఖ రాస్తున్నానని సోము వీర్రాజు తెలిపారు.