చంద్ర బాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది: లక్ష్మణ్

చంద్ర బాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది: లక్ష్మణ్

20రోజులుగా ఆర్టీసీనాయకులు శాంతి యుతంగా సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. హుజూర్ నగర్ ఉపఎన్నికలలో గెలిచిన తర్వాత కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. నిజామాబాద్ లో కవిత ఓడిపోయినపుడు,  ముగ్గురు ఎమ్మెల్సీలు ఓడిపోయినపుడు మీడియా సమావేశం పెట్టని కేసీఆర్ ఇప్పుడు మాత్రం కార్మికులపై కక్షపూని మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో…  నంద్యాల ఉపఎన్నికలలో భారీ మెజారిటీతో టీడీపీ గెలిచినా ఇప్పుడు చంద్రబాబు కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని అన్నారు లక్ష్మణ్.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని అన్నారు లక్ష్మణ్. రాజకీయాలుంటే తమతో తేల్చుకోవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను వేశాడుకనుకనే.. ఆర్టీసీ ఆస్తులను రక్షించుకొవడానికి బీజేపీ ఈ సమ్మెను బలోపేతం చేస్తుందని తెలిపారు. కార్మికులు ఆత్మస్ధైర్యం కోల్పోవద్దని కోరారు. ఆర్టీసీ తలపెట్టే ప్రతీ కార్యక్రమానికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు.