ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ బోటు షికారుపై బీజేపీ ఫైర్ 

ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ బోటు షికారుపై బీజేపీ ఫైర్ 
  • రాష్ట్రం ఆగమైతే.. సీఎం పిక్నిక్​లా?
  • ఎమ్మెల్యేలతో హేమంత్ సోరెన్ బోటు షికారుపై బీజేపీ ఫైర్ 

రాంచి:  జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనను డిస్ క్వాలిఫై చేయాలంటూ ఎన్నికల సంఘం ఇదివరకే తెలియజేయగా.. రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, శనివారం జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం హేమంత్ సోరెన్ పిక్నిక్ కు వెళ్లి, బోటు షికారు చేయడంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిన సమయంలో సీఎం సోరెన్ పిక్నిక్ వెళ్లి, బోటు షికార్లతో ఎంజాయ్ చేయడం ఏమిటంటూ బీజేపీ నేత బాబూలాల్ మరాండీ విమర్శించారు. గవర్నర్ డిస్ క్వాలిఫై చెయ్యకముందే సోరెన్ రాజీనామా చేయాలంటూ మరో బీజేపీ నేత భాను ప్రతాప్ షాహీ డిమాండ్ చేశారు.