హైదరాబాద్, వెలుగు: దేశం మొత్తమ్మీద కరోనా టెస్టులు అతితక్కువగా చేస్తున్నది మన రాష్ట్రంలోనేనని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఆరోపించారు. ఎక్కువమందికి టెస్టులు చేయాలని మొదట్నుంచీ తాము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బుధవారం విమర్శించారు. టెస్టులే చేయకుండా పాజిటివ్ కేసులు ఎట్లా తెలుస్తయ్.. మరణాలను ఎట్లా లెక్కగడతరని ఆయన నిలదీశారు. ప్రతీ ప్రెస్మీట్లో ఐసీఎంఆర్ గైడ్లైన్స్, టెస్టింగ్ ప్రొటోకాల్ పాటిస్తున్నామని చెబుతూ ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. టెస్టులు చేయకుండా అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను డేంజర్ స్టేజ్లోకి తీసుకెళుతున్నారని కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. రోజూ విడుదల చేస్తున్న బులెటిన్ లో ఎన్ని టెస్టులు చేస్తున్నరో చెప్పడంలేదన్నారు. వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ, నైతిక విలువలు ఉంటే మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. టెస్టులు చేయకుండా వైరస్ పాజిటివ్ అని ఎట్లా తేలుస్తరు, ఐసోలేషన్కు ఎట్లా పంపిస్తరు అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడాలేని టెక్నాలజీ మన ప్రభుత్వం దగ్గరుంటే మిగతా వారితో కూడా పంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. వీలైనంత వరకు ఎక్కువ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ వో చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో మా దగ్గరే కరోనా కేసులు, మరణాలు తక్కువని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. తక్కువ టెస్టులు చేయటం వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు.
దేశం మొత్తమ్మీద..మన రాష్ట్రంలోనే తక్కువ టెస్టులు
- లేటెస్ట్
- May 21, 2020
మరిన్ని వార్తలు
-
రైతు రుణమాఫీ చేయని మోదీ.. 16 లక్షల కోట్లు కార్పొరేట్ల లోన్లు మాఫీ చేసిండు: వివేక్ వెంకటస్వామి
-
పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
-
Rathnam OTT: OTTకి వచ్చేస్తున్న విశాల్ రత్నం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
సెన్సేషన్ జడ్జ్మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు
లేటెస్ట్
- రైతు రుణమాఫీ చేయని మోదీ.. 16 లక్షల కోట్లు కార్పొరేట్ల లోన్లు మాఫీ చేసిండు: వివేక్ వెంకటస్వామి
- పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
- Rathnam OTT: OTTకి వచ్చేస్తున్న విశాల్ రత్నం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సెన్సేషన్ జడ్జ్మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు
- CSK vs PBKS: జట్టులో ధోని అనవసరం.. అతని బదులు ఫాస్ట్ బౌలర్ను తీసుకోండి: హర్భజన్ సింగ్
- అయ్యయ్యో కంగనా.. సొంతపార్టీ అభ్యర్థి పైనే విమర్శలా?
- ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్
- Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య
- కవితకు బిగ్ షాక్ : రెండు బెయిల్ పిటిషన్లు కొట్టివేత
- నాకు ఉద్యోగం ఇస్తే.. కంపెనీకి రూ.41 వేలు ఇస్తా : రెజ్యూంతో ఆఫర్ ఇచ్చిన అభ్యర్థి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు