తెలంగాణ విమోచన దినం అంటే అలనాటి వీరులను స్మరించడమే అని అన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించక పోవడం బాధాకరమని చెప్పారు. సోమాజీగూడ లో బీజేపీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని తెలిపారు. రోషయ్య సీఎం గా ఉన్నప్పుడు కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారని.. TRS అధికారంలోకి వచ్చాక కావాలనే పక్కకు పెట్టారని చెప్పారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ఎందరో ప్రాణాలు కోల్పోయారని అప్పటి అరాచకపు పాలనను ఎదురించిన వీరులను తప్పక స్మరించుకోవాలని అన్నారు లక్ష్మణ్. అది కేవలం బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యమని తెలిపారు. విమోచన దినోత్సవంపై భవిష్యత్ కార్యాచరన కోసం మేధావుల సలహాలను తీసుకోనున్నామని అన్నారు లక్ష్మణ్.