ఓల్డ్‌‌ సిటీలో మెట్రో కోసం బీజేపీ ధర్నా

ఓల్డ్‌‌ సిటీలో మెట్రో కోసం బీజేపీ ధర్నా

హైదరాబాద్, వెలుగు : ఓల్డ్‌‌‌‌సిటీలో మెట్రోకారిడార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ నాయకులు బుధవారం లాల్‌‌‌‌దర్వాజ   మోడ్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఆందోళనకు పర్మిషన్​ లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. మహిళా నేతలనూ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో గౌలిపురా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆలే భాగ్యలక్ష్మి చేతికి గాయమైంది.

పోలీసుల తీరును నిరసిస్తూ నేతలు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు బొల్లారం పీఎస్‌‌‌‌కి తరలించారు. లాల్ దర్వాజ మోడ్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.