V6 News

బీజేపీలోకి కొత్తగా 3 కోట్ల 78 లక్షల మంది

బీజేపీలోకి కొత్తగా 3 కోట్ల 78 లక్షల మంది
  • పార్టీ మెంబర్​షిప్​ డ్రైవ్​కు​ అనూహ్య ఆదరణ
  •  టార్గెట్​ కంటే రెట్టింపు సభ్యుల చేరిక
  • పూర్తి లెక్కలొస్తే మెంబర్ల సంఖ్య 5 కోట్లు క్రాస్​ అవుతుందన్న పార్టీ వైస్​ ప్రెసిడెంట్​ దుష్యంత్​

దాదాపు 11 కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతున్న బీజేపీ బలం మరింత పెరిగింది. దాదాపు నెలన్నరపాటు సాగిన మెంబర్​షిప్​ డ్రైవ్ సూపర్​ సక్సెస్​ అయిందని, డ్రైవ్​ ముగిసిన మంగళవారం నాటికి పార్టీలోకి కొత్తగా 3.78 కోట్ల మంది చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి కచ్చితమైన లెక్కలొస్తే ఆ సంఖ్య ఈజీగా 5కోట్లకు చేరుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మెంబర్​షిప్​ డ్రైవ్​ కో కన్వీనర్​ దుష్యంత్​ కుమార్​ గౌతమ్​ తెలిపారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ హెడ్​క్వార్టర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2015లోనే  పార్టీ మెంబర్ల సంఖ్య11 కోట్లకు చేరిందని గుర్తుచేసిన ఆయన.. 2019 మెంబర్​షిప్​ డ్రైవ్​లో కనీసం 20 శాతం కొత్తవాళ్లను అంటే 2.2 కోట్ల మందిని చేర్చుకోవాలని పార్టీ టార్గెట్​ పెట్టుకుందని అయితే టార్గెట్ కంటే రెట్టింపు సంఖ్యలో సభ్యులు చేరడం బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని దుష్యంత్​ అన్నారు. జనసంఘ్​ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద ముఖర్జీ జయంతినాడు(జులై 6న) బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో, పార్టీ చీఫ్​ అమిత్​ షా తెలంగాణలో ఆ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. డ్రైవ్​ చివరిరోజైన ఆగస్టు 20 నాటికి 3, 78, 67, 753 మంది కొత్తవాళ్లు బీజేపీలో చేరారని, అన్ని రాష్ట్రాల నుంచి పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి ఉందని వివరించారు. 2015నాటి మెంబర్​షిప్ డ్రైవ్​​పై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈసారి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. పార్టీలో చేరేందుకు మిస్డ్​ కాల్​ ఇచ్చినవారి పేర్లు, అడ్రస్​లు, ఫోన్​ నంబర్లు పక్కాగా సేకరించారు. గతంలోలాగే ఈసారి కూడా మెజార్టీ చేరికలు మిస్డ్​కాల్​ ద్వారానే జరిగాయి. బీజేపీ వెబ్​సైట్​, మోడీ యాప్ ద్వారానూ ఈసారి చెప్పుకోదగ్గస్థాయిలో మెంబర్లు చేరారు. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా 65 లక్షల మంది కొత్త సభ్యుల చేరికతో ఉత్తరప్రదేశ్​ తొలి స్థానంలో నిలిచింది. వెస్ట్​బెంగాల్​లో 36 లక్షలు, గుజరాత్​లో 34 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది  కొత్తగా కాషాయ కండువా కప్పుకున్నారు. మెంబర్​షిప్​ డ్రైవ్​ ముగియడంతో ఇక సెప్టెంబర్​లో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబర్​ నాటికి నేషనల్​ కౌన్సిల్​ మెంబర్ల ఎన్నిక పూర్తవుతుందని దుష్యత్​ తెలిపారు. మోడీ పాపులారిటీ, అమిత్​ షా చాణక్యనీతికి ఆకర్షితులై కొత్తవాళ్లు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన చెప్పారు.