అమిత్ షా ఆదేశాలతో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు: లక్ష్మణ్

అమిత్ షా ఆదేశాలతో జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు: లక్ష్మణ్

మంచిర్యాల జిల్లా కేంద్రం ఎసీసీ క్వారీలో బీజేపీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బీజేపీ కార్యాలయం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడిన ఆయన…  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తుందని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ చేసిన వ్యాఖ్యల పై కేంద్రానికి, గవర్నర్ కు పిర్యాదు చేశామని చెప్పారు. మందబలం ఉందని కేసీఆర్ అహంకారపూర్వకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. TSRTC కి బదులు TRS RTC చెయ్యాలని కేసీఆర్ ప్లాన్ చేశారని అన్నారు. ఈ రోజటితో ఆర్టీసీ సమ్మె 50రోజులు పూర్తి చేసుకోనుందని.. ఇప్పటికైనా బేషరతుగా ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు  ఫడ్నవీస్ సీఎం గా మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.

బీజేపీ జిల్లా కార్యాలయానికి భుమిపూజ చేసినవారిలో లక్ష్మణ్ తోపాటు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి, బీజేపీ నాయకులు వెరబెల్లి రఘునాథ్, వెంకటేశ్వర్లు గౌడ్, హేమాజీ పాల్గొన్నారు.