
- జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
సికింద్రాబాద్, వెలుగు: అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు బీజేపీ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్ సోమవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లింది. ఈ రైలును కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో 1,346 మంది బీజేపీ కార్యకర్తలకు అవకాశం కల్పించారు. ఈ రైలు కాజీపేట, మంచిర్యాల,చంద్రాపూర్, నాగపూర్ మీదుగా మంగళవారం అయోధ్యకు చేరుకుంటుందని బీజేపీ నాయకులు తెలిపారు.
పలు రైళ్ల రద్దు..
సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు, చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పలు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఈ నెల11 వరకు రద్దు చేశారు.