బండి సంజయ్‌ దీక్ష‌ భగ్నం

బండి సంజయ్‌ దీక్ష‌ భగ్నం

కరీంనగర్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష‌ను పోలీసులు భగ్నం చేశారు. సిద్ధిపేటలో తన పర్యటనలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ తన కార్యాలయంలోనే నిరాహార దీక్షకు దిగిన సంజయ్‌ ఆరోగ్య స్థితిని డాక్టర్లు పరీక్షించారు. ప్రైవేటు డాక్టర్ లు వైద్య పరీక్షలు నిర్వహించగా షుగర్ లెవెల్ 70కి పడిపోయాయి. దీంతో సంజయ్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండటంతో ప్రభుత్వ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ఎక్కించారు. అనంతరం హుటాహుటిన అంబులెన్స్‌లో నగరంలోని అపోలో రీచ్‌ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆస్పత్రిలో బండి సంజయ్ దీక్ష విరమించారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి సంజయ్‌ చేత దీక్ష విరమింపజేశారు.