తెలంగాణలో పడగ విప్పుతున్న బ్లాక్ ఫంగస్

తెలంగాణలో పడగ విప్పుతున్న బ్లాక్ ఫంగస్

ఎడపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పడగ విప్పుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. మండల వాసుల్లో తాజాగా ముగ్గురికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయినట్లు సమాచారం. బ్లాక్ ఫంగస్ సోకిన బాధితుల్లో  ప్రస్తుతం ఒకరికి హైదరాబాద్ లో, ఇద్దరికి నిజామాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ ల్లో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త వహిస్తోంది. ఇద్దరు జానకంపేట్ గ్రామ వాసుల్లో అనుమానిత లక్షణాలు ఉన్నట్లు సమాచారం. మరొకరు ఠాణాకలాన్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధికి  హైదరాబాద్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రూ.18లక్షలకు పైగా ఖర్చు చేశామన్న ఓ బాధితుడు.. ఒకరికి కంటి సమస్య రాగా, మరో ఇద్దరికి దవడ ఆపరేషన్ జరిగినట్లు సమాచారం.