సోనుసూద్ పై ఫిర్యాదు నమోదు

సోనుసూద్ పై ఫిర్యాదు నమోదు
బాలీవుడ్ యాక్టర్ సోనుసూద్ పై ముంబై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ముంబైలోని తన ఇంటిని హోటల్ గా మార్చారంటూ ఆయనపై ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు BMC పోలీసులు. ఇంటిని హోటల్ గా మార్చాడనే ఆరోపణలపై సోనుసూద్ ఇంకా స్పందించలేదు. ఇదే బిల్డింగ్ ను కరోనా టైంలో వైద్య సిబ్బందికి అప్పగించారు సోను. కరోనా టైంలో హెల్త్ సిబ్బంది ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి రావటంతో.. తన ఆరంతస్థుల బిల్డింగ్ ను వారికి అప్పగించేశారు. సోను సూద్ పై ఫిర్యాదు చేయడాన్ని తప్పుబట్టారు బీజేపీ నేతలు. సోను సూద్ ను శివసేన సర్కారు టార్గెట్ చేసిందన్నారు. గతంలో బాలీవుడ్ యాక్ట్రస్ కంగనా రనౌత్ విషయంలోనూ ఇలానే చేసిందన్నారు. సోను సూద్ చేస్తున్న సోషల్ వర్క్ పై శివసేన సర్కారు మొదటి నుంచీ వ్యతిరేకంగానే ఉందని విమర్శించారు.