ఉజ్జయిని మహంకాళికి ముందే బోనాలు

ఉజ్జయిని మహంకాళికి ముందే బోనాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 10 నుంచి 12 వరకు జరగనున్న బోనాల ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేకపోవడంతో ముందే బోనాలు సమర్పిస్తున్నారు. గురువారం వేలాది మంది వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా వేగంగా స్ప్రెడ్ అవుతున్నా క్యూ లైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ కనిపించలేదు. మరోవైపు, లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు శుక్రవారం ధ్వజారోహణ, శిఖర పూజతో షురూ కానున్నాయి. ఈసారి మాత్రం కరోనా కారణంగా గైడ్లైన్స్ పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ జె.లక్ష్మీనారాయణ గౌడ్ తెలిపారు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాల కోసం ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ‑ హైదరాబాద్, వెలుగు

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి