హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి దావోస్ టూర్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాల పునాదులపై రేవంత్రాజకీయం చేస్తున్నారన్నారు.
దావోస్లోనూ చిల్లరగా వ్యవహరించారన్నారు. చదువుకున్న మంత్రి శ్రీధర్బాబును సీఎం తక్కువ చేసి చూపించారన్నారు. కేటీఆర్ మంత్రిగా రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.2.40 లక్షల కోట్లకు పెంచారన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం మాట్లాడారని, రైతు భరోసా ఇవ్వకున్నా ఇస్తున్నట్టు చెప్పుకున్నారని మండిపడ్డారు.