కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రేవంత్ టూర్ : దాసోజు శ్రవణ్

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రేవంత్ టూర్ :  దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: రేవంత్​ రెడ్డి దావోస్​ టూర్ ​కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని బీఆర్ఎస్​ హైదరాబాద్ ​జిల్లా ఇన్​చార్జ్​ దాసోజు శ్రవణ్​అన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధాల పునాదులపై రేవంత్​రాజకీయం చేస్తున్నారన్నారు.

 దావోస్​లోనూ చిల్లరగా వ్యవహరించారన్నారు. చదువుకున్న మంత్రి శ్రీధర్​బాబును సీఎం  తక్కువ చేసి చూపించారన్నారు. కేటీఆర్​ మంత్రిగా రాష్ట్ర ఐటీ ఎగుమతులను రూ.2.40 లక్షల కోట్లకు పెంచారన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా సీఎం మాట్లాడారని, రైతు భరోసా ఇవ్వకున్నా ఇస్తున్నట్టు చెప్పుకున్నారని మండిపడ్డారు.