జనగామ అర్బన్, వెలుగు : జనగామ కలెక్టర్ శివలింగయ్య అవినీతిపై ఎంక్వైరీ చేయాలని రైతు సంఘం నాయకుడు బుక్యా చందూనాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ధరణి, వెల్ఫేర్, మున్సిపల్, అగ్రికల్చర్, సివిల్ సప్లై శాఖలతో పాటు దశాబ్ది ఉత్సవాల టైంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
అలాగే డీసీఎస్వో, సివిల్ సప్లై డీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లతో కలిసి దళిత బంధు, వడ్ల కొనుగోళ్లు, రైస్మిల్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతి చేశారన్నారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.