కలెక్టర్‌‌ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి : బుక్యా చందూనాయక్

కలెక్టర్‌‌ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి : బుక్యా చందూనాయక్

జనగామ అర్బన్, వెలుగు : జనగామ కలెక్టర్‌‌ శివలింగయ్య అవినీతిపై ఎంక్వైరీ చేయాలని రైతు సంఘం నాయకుడు బుక్యా చందూనాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ధరణి, వెల్ఫేర్‌‌, మున్సిపల్‌‌, అగ్రికల్చర్‌‌, సివిల్‌‌ సప్లై శాఖలతో పాటు దశాబ్ది ఉత్సవాల టైంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

అలాగే  డీసీఎస్‌‌వో, సివిల్‌‌ సప్లై డీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లతో కలిసి దళిత బంధు, వడ్ల కొనుగోళ్లు, రైస్​మిల్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల అవినీతి చేశారన్నారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌‌ ఇవ్వకుండా, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని డిమాండ్‌‌ చేశారు.