వందే భారత్ లో టాయ్ లెట్స్ సూపర్.. ఫుడ్డే బాగోలేదు..

 వందే భారత్ లో టాయ్ లెట్స్ సూపర్.. ఫుడ్డే బాగోలేదు..

చాలామంది ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పుడు వందేభారత్​ ట్రైన్స్​లో ప్రయాణం చేస్తున్నారు.   ఈ ట్రైన్​ లో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా సయం కూడా ఆదా అవుతుంది.  అయితే కోల్​కతాకు చెందిన ఓ మహిళ వందేభారత్​లో మొదటి సారిగా ప్రయాణించింది.  అయితే ఆమె తన జర్నీ అనుభవాలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది,  టాయ్​లెట్స్​ సూపర్​ గా ఉన్నాయంటూ.. ఫుడ్​ మాత్రం బాగాలేదంటూ చెప్పుకొచ్చింది. 

కిటికీ షీల్డ్​ల గురించి ప్రారంభించిన కథనాన్ని  @epicnephrin_e అనే వినియోగదారు పేరుతో పిలువబడే ప్రయాణికురాలు  ప్రారంభించింది.  వందేభారత్​ ట్రైన్​ లో ప్రయాణం చేసేటప్పుడు  ఆమె తన ముఖాన్ని  డెనిమ్ జాకెట్‌తో కప్పుకోవాలని తెలిపింది.  ఇక ఆహారం  ( స్నాక్స్​)విషయంలో శతాబ్ది ఎక్స్ ప్రెస్​ తో పోలిస్తూ ధర సమానంగానే ఉన్నా.. క్వాలిటీ విషయంలో మాత్రం వందేభారత్​ ట్రైన్​ లో బాగాలేదని తెలిపింది. . మధ్యాహ్న భోజనం  బాగానే ఉన్నప్పటికి ... వెచ్చదనం.. తాజా ఫుడ్​ విషయంలో ప్రశంసించింది. 

వాష్​ రూముల గురించి రాస్తూ.. ఆటోమేటిక్​ డోర్లు.. లోపల చాలా క్లీన్​ గా ఉందని తెలిపింది.  వందేభారత్​ ట్రైన్​ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని కోల్​కతా మహిళ తన అనుభవాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.  దీనిపై స్పందించిన నెటిజన్లు రైలులోని లోపాల గురించి రాశారు.  ఓవర్​ హెడ్​ లగేజ్​ షెల్ఫ్​ చాలా అధ్వాన్నంగా ఉందని ఒకరు రాయగా... మరొకరు బ్యాగులు కిందపడకుండా ఉండేందుకు తగినంత వాలు లేదని కామెంట్​ చేశారు.  మూడవ వారు ఫుడ్​చాలా దయనీయంగా ఉందని రాశారు,  ఇంకా రైలు వేగం పెరిగే కొద్దీ.. ఏసీ సరిగా పని చేయదని.. ఓవర్​ హెడ్​ లగేజీ కారణంగా విండో సీట్లకు చల్లని గాలి అందదని ఇంకొకరు రాశారు.