అమీర్ పేట్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం స్పష్టించింది. టైర్ పేలడంతో అదుపుతప్పి మెట్రో డివైడర్ ను ఢీకొట్టింది. తర్వాత పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి బాచుపల్లి వెళ్తున్న మియాపూర్-1 డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ముందు టైరు ఆమీర్ పేట్ కు రాగానే పేలింది. దీంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న దుకాణాలను గుద్దుకుని ఆగింది. అయితే… డ్రైవర్ అలర్ట్ అయి బస్సును షాప్ ల దిక్కు తిప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్యాసింజర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును అక్కడి నుంచి తరలించారు. ప్రమాదం సమయంలో ఎదురుగా వేరే వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.