విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ.. పార్టీ సభ్యత్వం ఇచ్చిన లక్ష్మణ్

విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ.. పార్టీ సభ్యత్వం ఇచ్చిన లక్ష్మణ్

మహారాష్ట్రకు గవర్నర్ గా సేవలందించిన విద్యాసాగర్ రావు తిరిగి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. గవర్నర్ గా పదవీకాలం పూర్తయిన ఆయనకు సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావుకు సభ్యత్వం ఇవ్వడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ పార్టీ కూడా పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు జరపడంలేదని ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయిన రోషయ్యను ప్రశ్నించిన కేసీఆర్ తన ప్రభుత్వంలో మాత్రం విమోచన దినాన్ని జరుపలేదని అన్నారు లక్ష్మణ్. రాష్ట్ర హైకోర్టు అసెంబ్లీ నిర్మాణానికి అడ్డుకట్టవేయడం హర్షనీయమని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ కు కనువిప్పుకలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు లక్ష్మణ్.