సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గాంజాయి పట్టుబడింది. కిలోల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు  రైల్వే పోలీసులు.  ఓ వ్యక్తి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని..ఓ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ అనే వ్యక్తి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నాడు.  ఒడిశా నుంచి ముంబాయి తరలిస్తుండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. నెలన్నరలో 1.5 క్వింటాల్లా గాంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డి,ఎస్పీ చంద్ర బాను తెలిపారు.