
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ఎఫెక్ట్ తో ఇవాళ(శనివారం) సాయంత్రం వరకు తెలంగాణ, ఏపిలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు బలపడుతాయని చెప్పింది. అదేవిధంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమలో వానలు పడుతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.