అమరావతి కోసం చాయ్ అమ్మడానికైనా రెడీ

అమరావతి కోసం చాయ్ అమ్మడానికైనా రెడీ

అనంతపురం : అమరావతి పరిరక్షణే టీడీపీ లక్ష్యం అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి మార్పును నిరసిస్తూ టీడీపీ ఆందోళనలను ఉధృతం చేస్తోందన్నారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాజధాని కోసం కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర జోలెపట్టి విరాళాలు సేకరించారు. అంతకుముందు కొడికొండ చెక్ పోస్టు నుంచి చంద్రబాబు బస్సు యాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  ఇవాళ సాయంత్రం అనంతపురంలో మేముసైతం కాన్సెప్ట్ లాగా చంద్రబాబా పండ్లు, టీ అమ్మి .. నిధులు సేకరించనున్నట్లు తెలిపారు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు.

See Also : గొంతులో ఇరుక్కున్న చికెన్ బొక్క : ఉక్కిరిబిక్కిరైన బాలుడు