- జైలులో చంద్రబాబుకు ప్రాణహాని
- ఆయన రిలీజ్ తర్వాతే తెలంగాణ ఎలక్షన్స్ పై ఫోకస్: కాసాని
హైదరాబాద్, వెలుగు : రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందనీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆయనకు ఏం జరిగినా ఏపీ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు రిలీజ్ తర్వాతే తెలంగాణ ఎలక్షన్స్ పై తాము ఫోకస్ పెడతామని వెల్లడించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కాసాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కావాల్సిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.
జైలులో వేడికి చమటలు పట్టి చంద్రబాబు శరీరం బొబ్బలు, పొక్కులు వచ్చి బాధపడుతున్నారని, బరువు కూడా తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం పట్ల జగన్ ప్రభుత్వంతో పాటు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. స్పెషల్ మెడికల్ టీం ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందించాలని కాసాని డిమాండ్ చేశారు.