వరంగల్ రూరల్ : పర్వతగిరి మండలం ఏనుగల్ కార్యదర్శి రమాదేవితో శనివారం ఫోన్ లో మాట్లాడారు సీఎం కేసీఆర్. గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏనుగల్ గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించి పంచాయతీ కార్యదర్శి రమాదేవిని అడిగి తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు.
