బీహార్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

బీహార్ కు  చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ బీహార్  చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పాట్నాకు వెళ్లారు. కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, జాతీయ రైతు సంఘాల నేతలు ఉన్నారు. గతంలో ప్రకటించినట్లుగా గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. 

అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం అందజేయనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.