ఇయ్యాల యాదాద్రికి సీఎం కేసీఆర్

ఇయ్యాల యాదాద్రికి సీఎం కేసీఆర్

హైదరాబాద్, యాదాద్రి, వెలుగు: సీఎం కేసీఆర్ సోమవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. పొద్దున ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 11 గంటలకు యాదాద్రికి చేరుకోనున్నారు. ముందుగా బాలాలయంలో స్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత కొత్త గుడిలో నర్సింహస్వామిని దర్శించుకుంటారు. గుడి పనులతో పాటు వచ్చే నెల 21న జరిగే సుదర్శన యాగం, 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణ పనులను సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. గుడిని ప్రారంభించటానికి మరో 40 రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో పనులు స్పీడ్​గా జరుగుతున్నాయి. కొండపై నిర్మాణంలో ఉన్న బస్టాండ్, మెయిన్ ఘాట్ రోడ్డు పనులతో పాటు గండి చెరువు, కొండ కింద బస్టాప్​​ పనులు ఆయన పరిశీలించనున్నారు.