సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు

సీఎం కేసీఆర్ తన యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ముందుగా తెలిపిన సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రికి చేరుకుని శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణంలో  పాల్గొనాల్సింది. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని సీఎంవో వర్గాలు గురువారం తెలిపాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా సీఎం పర్యటన రద్దుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యాదాద్రికి చేరుకున్నారు. ఆయన ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

మరిన్ని వార్తల కోసం...

కొత్త ఉద్యోగుల జీతాల కోసం రూ.2 వేల కోట్లు