
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మాసపత్రికను శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, సీఎం సీపీఆర్ఓ అయోధ్యరెడ్డి, తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ సుబ్రమణ్య శాస్త్రీ తదతరులు పాల్గొన్నారు.