స్టాండప్ కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ మృతి

 స్టాండప్ కమెడియన్‌  రాజు  శ్రీవాస్తవ మృతి

బాలీవుడ్  స్టాండప్ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ్ కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆగస్టు 10న జిమ్ చేస్తుండగా.. రాజు శ్రీవాత్సవ్ చెస్ట్ పెయిన్ తో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు రాజుని ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్ కు ట్రీట్మెంట్ చేశాక బ్రెయిన్ డ్యామేజ్ తో ఇబ్బందిప్డడారు. గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న రాజు.. ఇవాళ కన్నుమూశారు.

డిసెంబర్ 25 , 1993లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించారు. ది గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్, కామెడీ సర్కస్, కపిల్ శర్మ షో , శక్తిమాన్ వంటి షోలతో పాపులారిటీ సంపాదించారు. మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్ లాంటి బాలీవుడ్ మూవీస్ లో నటించారు. రాజుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

2014లోసమాజ్ వాదీ పార్టీలో చేరిన రాజు.. ఆ తర్వాత అదే ఏడాది బీజేపీలో చేరారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కి ప్రధాని మోడీ రాజుని నామినేట్ చేశారు. అప్పట్నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.